గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు రషీద్ ఖాన్ బౌలింగ్లో అభిషేక్ శర్మ (42) అవుటవగా.. మరో ఓపెనర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57)ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించిన విలియమ్సన్ అవుటవడంతో సన్రైజర్స్ బ్యాటింగ్ వేగం కుంటుపడింది. 17 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఇంకా సన్రైజర్స్ విజయానికి 28 పరుగులు కావలసి ఉంది.