న్యూఢిల్లీ: ఫిన్లాండ్లో శిక్షణ పొందేందుకు ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు కేంద్ర క్రీడాశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తన నిలకడైన ప్రదర్శనతో ఇటీవలే ప్రపంచ నంబర్వన్ జావెలిన్ త్రోయర్గా నిలిచిన నీరజ్.. టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ఫిన్లాండ్లోని ఒలింపిక్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకోబోతున్నాడు.
మరోవైపు మిషన్ ఒలింపిక్ సెల్లో భాగంగా తైవాన్లో మెరుగైన శిక్షణ కోసం యువ ప్యాడ్లర్ పయాస్ జైన్కు క్రీడాశాఖ అమోదం తెలిపింది. సీనియర్ ప్యాడ్లర్లు మనికా బాత్రా, సాతియాన్ జ్ఞానశేఖర్ కోచ్లు అమన్, ఎస్ రామన్ వెంట తీసుకెళ్లేందుకు అనుమతి లభించింది.