హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో పతకాలు సాధించిన రాష్ట్ర వెయిట్ లిఫ్టర్లను క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. పంచకుల వేదికగా జరుగుతున్న టోర్నీలో.. రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన వీరేశ్ రజత పతకం సాధించగా.. గణేశ్ కాంస్యంతో మెరిశాడు. వీరిద్దరూ ఆదివారం క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా యువ లిఫ్టర్లను సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పాఠశాల వోఎస్డీ హరికృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ బోస్, కోచ్ మాణిక్యాలరావు పాల్గొన్నారు.