హైదరాబాద్, ఆటప్రతినిధి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ముర్షిదాబాద్లో జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన 81కి.మీల స్విమ్మింగ్ టోర్నీలో లక్ష్యాన్ని అందుకున్న వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామలను మంత్రి అభినందించారు.
గతంలో తలైమనార్ నుంచి ధనుశ్కోటి వరకు, అమెరికాలోని క్యాటలీనా చానల్ నుంచి లాస్వేగాస్ వరకు జరిగిన పోటీల్లో రాణించిన శ్యామల రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి శ్యామలకు పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్రి లక్ష్మణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.