Cameraman Thiru : భారత క్రికెట్లో విషాదం నెలకొంది. సీనియర్ స్పోర్ట్స్ కెమెరామన్ కమలనదిముథు తిరువల్లవున్(Kamalanadimuthu Thiruvalluvan) కన్నుమూశాడు. భారత క్రికెట్ అభిమానులకు ‘తిరు’గా సుపరిచితుడైన ఆయన 57 ఏండ్ల వయసులో ఈ లోకాన్ని వీడాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)రెండో సీజన్ తొలి మ్యాచ్ను కవర్ చేసిన తిరువల్లవున్ శనివారం ఉదయం ప్రాణాలు విడిచాడు.
అతడి మరణవార్త తెలియగానే మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. హర్ష భోగ్లే (Harsha Bhogle) మాట్లాడుతూ.. ‘ఇదొక షాకింగ్ న్యూస్. ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపించే తిరు గొప్ప కెమెరామెన్. భారత కెమెరామెన్లకు ఏమంత గుర్తింపు లేని సమయంలోనే అతడు సొంత ఖర్చుతో మిడ్వికెట్ కెమెరా కొన్నాడు. అతడిని మిస్ అవ్వడం ఎంతో బాధాకరం’ అని అన్నాడు.
Absolutely shocking news. The ever smiling Thiru was a top man. At a time when Indian cameramen weren’t yet rated, Thiru made the mid-wicket camera all his own and was excellent. Everytime we met, I would sing out his full name and he would offer his toothy smile in return.… https://t.co/HFdrOptLUb
— Harsha Bhogle (@bhogleharsha) February 24, 2024
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్(Shah Ruh Khan), టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాలు తమ డ్యాన్స్లతో హుషారెత్తించారు. నిరుడు ఫైనలిస్టులు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన తొలి మ్యాచ్ను తిరు కవర్ చేశాడు. మ్యాచ్ ఆసాంతం అతడు ఉత్సాహంగా కనిపించాడు. అలాంటిది శనివారం ఉదయం అతడు చనిపోయాడని తెలిసి అందరూ షాక్లో ఉండిపోయారు.