NIA | కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నిధుల నెట్వర్క్ను నిర్మూలించే దిశగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హంద్వారా నార్కో-టెర్రరిజం కేసులో నలుగురి ఆస్తులను జప్తు చేసింది. దాంతో పాటు నగదును స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులు రెండు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా (లష్కర్), హిజ్బుల్ ముజాహిదీన్ (HM)తో సంబంధం ఉన్న కేసులో ఈ చర్యలు తీసుకున్నది. సమాచారం ప్రకారం.. కుప్వారా జిల్లాలోని హంద్వారా తహసీల్లో నలుగురు నిందితుల ఆస్తులను ఎన్ఐఏ అటాచ్ చేసింది.
ఇందులో యూఏ (P) చట్టంలోని సెక్షన్ 25 కింద మొత్తం 2.27 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అటాచ్ చేసిన స్థిరాస్తుల్లో నిందితుడు అఫాక్ అహ్మద్ వనీకి చెందిన రెండంతస్తుల ఇల్లు, నిందితుడు మునీర్ అహ్మద్ పాండేకు చెందిన ఇల్లు, సలీం ఆంద్రాబీ ఇల్లు, ఇస్లాం ఉల్ హక్ రెండంతస్తుల ఇండ్లు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేయగా.. 15 మందిపై ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.