చెమ్స్ఫోర్డ్ : ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చోటు దక్కించుకుంది. సోమవారం బంగ్లాదేశ్-ఐర్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా మధ్యలోనే రద్దవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది.
మూడు మ్యాచ్ల సిరీస్ను ఐర్లాండ్ 3-0తో గెలిచిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా బదులుగా ప్రపంచకప్ స్థానం దక్కించుకునేది. కానీ తొలుత బంగ్లాదేశ్ 9 వికెట్లకు 246 పరుగులు చేయగా ఛేదనలో ఐర్లాండ్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 65 పరుగులు చేసిన తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది.