జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. 2016లో టెస్టు అరంగేట్రం చేసిన మోరిస్ కేవలం నాలుగు మ్యాచ్లు ఆడాడు. సఫారీ జట్టు తరఫున 42 వన్డేలు, 23 టీ20లు ఆడిన ఈ ఆల్రౌండర్ వన్డేల్లో 467, టీ20ల్లో 133 పరుగులు చేశాడు. ‘ఈరోజు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇది ఒక అద్భుత ప్రయాణం. ఆటలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కోచింగ్ బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.