లండన్: వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టులో స్టార్ స్పిన్నర్ సోఫియా ఎకెల్స్టోన్కు చోటు దక్కింది. భుజం గాయం నుంచి కోలుకున్న సోఫియాను భారత టూర్కు ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ కోచ్ జాన్ లెవీస్ తెలిపాడు.
డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్లో భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు ఓ టెస్టు ఆడనుండగా.. శుక్రవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రెండు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ప్రకటించింది. ఈ రెండు జట్లకు హీతర్ నైట్ సారథ్యం వహించనుంది. ఇంగ్లండ్ మహిళల టీ20 జట్టు: హీతర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మైయా బౌచర్, అలీస్ కాప్సీ, చార్లీ డీన్, సోఫియా డాంక్లీ, సోఫియా ఎకెల్స్టోన్, మహిక గౌర్, డానియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, కెంప్, స్కీవర్ బ్రంట్, డానియల్ వ్యాట్.