Hundred League | లండన్ : యూకే వేదికగా జరుగబోయే ‘హండ్రెడ్ లీగ్’లో భారత్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లకు మాత్రమే అవకాశం దక్కింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్లు తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్లో చోటు దక్కించుకున్నారు.
రాబోయే సీజన్లో మంధాన గతంలోఆడిన సౌథర్న్ బ్రేవ్కే ఆడనుండగా రిచా.. బర్మింగ్హామ్ ఫోనెక్స్ తరఫున బరిలోకి దిగనుంది. ఈ లీగ్లో ఆడేందుకు హర్మన్ప్రీత్, దీప్తిశర్మ, శ్రేయాంక వంటి స్టార్ ప్లేయర్లు పేర్లు నమోదుచేసుకున్నా చాన్స్ లభించలేదు.