హామిల్టన్: మహిళల ప్రపంచ కప్ వన్డే క్రికెట్లో.. ఇవాళ స్మృతి మందాన, హర్మన్ప్రీత్ కౌర్లు సెంచరీలతో చెలరేగారు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మందాన 123 రన్స్ చేసింది. స్మృతి ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో స్మృతికి ఇది అయిదో సెంచరీ కావడం విశేషం. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా మహిళల జట్టుకు స్మృతి మంచి స్టార్ట్ ఇచ్చారు. మరో ఓపెనర్ యాసిత్ భాటియాతో కలిసి ఇద్దరూ తొలి వికెట్కు 49 రన్స్ జోడించారు. ఆ తర్వాత మిథాలీ, దీప్తిలు త్వరత్వరగా ఔటయ్యారు. ఇక నాలుగో వికెట్కు హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి స్మృతి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 184 రన్స్ జోడించారు. వుమెన్స్ వరల్డ్ కప్లో భారత జట్టుకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. స్మృతి ఔటైన తర్వాత హర్మన్ప్రీత్ జోరందుకున్నారు. 100 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ చేసింది. ఎడమ చేతి బ్యాటింగ్ చేసే మందాన ఈ మ్యాచ్లో అన్ని రకాల షాట్లతో అలరించింది. 2017 వరల్డ్కప్లోనూ స్మృతి .. వెస్టిండీస్పై సెంచరీతో హోరెత్తిన విషయం తెలిసిందే. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో ఇండియా వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 317 రన్స్ చేసింది. హర్మన్ 109 రన్స్ చేసి ఔటైంది.
Fourth ODI century for Harmanpreet Kaur 🔥#CWC22 pic.twitter.com/DJ3TpQNbvu
— ICC (@ICC) March 12, 2022
Smriti Mandhana's outstanding innings has set India up for a big total against West Indies 🙌#CWC22 pic.twitter.com/XuvyJBdH62
— ICC (@ICC) March 12, 2022