హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈ నెల 25 నుంచి స్లాన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ జరుగనుంది. రాష్ట్ర చెస్ సంఘం సహకారంతో యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగనున్న టో ర్నీలో భారత్ సహా కెనడా, యెమన్, అమెరికా నుంచి చెస్మాస్టర్లు బరిలో దిగుతున్నారు.
ఫిడే రేటింగ్ 1600లోపు ఉన్న ప్లేయర్లు స్విస్ సిస్టమ్లో తొమ్మిది రౌండ్ల పాటు తలపడుతారు. టోర్నీకి సంబంధించిన బ్రౌచర్ను శనివారం సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆవిష్కరించారు. టోర్నీలో పోటీపడాలనుకునే వారు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 7386377787 సంప్రదించవచ్చు.