పల్లెకెలె : బ్యాటర్ల ధనాధన్ మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. గురువారం పల్లెకెలలో ఆ జట్టు.. ఒమన్పై ఏకంగా 105 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 రన్స్ సాధించారు.
కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61, 7 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పవన్ రత్నాయకె (28 బంతుల్లో 60 పరుగులు 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దసున్ శనక (20 బంతుల్లో 50, 2 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టారు. వీరి ధాటికి ఒమన్ బౌలర్లంతా ఓవర్కు పదికి పైగా పరుగులు సమర్పించుకున్నారు. టీ20ల్లో లంకకు ఇది రెండో అత్యుత్తమ (కెన్యాపై 260/6) స్కోరు. ఛేదనలో ఒమన్.. నిర్ణీత ఓవర్లలో 120/9 మాత్రమే చేసింది.