క్యాండీ: ఓపెనర్లు దిముత్ కరుణరత్నె (118), లహిరు తిరిమన్నె (131 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో లంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో తొలి రోజు ఆటలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన లంక 291 పరుగులు చేసింది. తిరిమన్నెతో పాటు ఫెర్నాండో (40) క్రీజులో ఉన్నాడు.