న్యూఢిల్లీ: సుదీర్ఘ ఫార్మాట్లో నమ్మదగ్గ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో సీనియర్ సెలెక్షన్ కమిటీ సిరాజ్ను ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని అందులో పేర్కొన్నాడు.