కౌలాలాంపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తొలి రౌండ్లో బై దక్కించుకున్నారు.
ఈ నెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీకి సంబంధించి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య గురువారం ‘డ్రా’ విడుదల చేసింది. 2019లో ప్రపంచ చాంపియన్ టైటిల్ నెగ్గిన సింధు.. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన విషయం తెలిసిందే.