PV Sindhu | న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ కెనడా ఓపెన్లో సత్తాచాటుతున్నారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో వీరిద్దరూ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21-13, 21-7తో ఫాంగ్ జైపై విజయం సాధించింది. నిరుడు బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సింధు.. క్వార్టర్స్ పోరులో విజృంభించింది. వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని చిత్తుచేసి విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ అకానె యామగుచితో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-8, 17-21, 21-10తో జూలియన్పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టాడు.