కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. కాన్పూర్లో ఇవాళ ప్రారంభమైన తొలి టెస్టులో ఇండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే జేమీసన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ 13 రన్స్ చేసి ఔటయ్యాడు. రెండో వికెట్కు శుభమన్ గిల్, పుజారాలు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 81 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది నాలగవ హాఫ్ సెంచరీ కావడం విశేషం. భోజన విరామ సమయానికి భారత్ 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 రన్స్ చేసింది. గిల్ 52, పుజారా 15 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.