IND vs ENG 1st Test: గతేడాది సూపర్ ఫామ్తో ప్రపంచ క్రికెట్ను తనవైపునకు తిప్పుకున్న టీమిండియా యువ ఓపెనర్ టెస్టులలో అత్యంత చెత్త ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్తో పాటు భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్.. గతేడాది ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత కనీసం 40 పరుగుల స్కోరు కూడా చేయలేదు. తాజాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ముక్కీ మూలుగుతూ 23 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్లో రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్ అయ్యాడు.
అహ్మదాబాద్లో ఆసీస్పై సెంచరీ (128) చేసిన తర్వాత గిల్ ఆడిన 9 ఇన్నింగ్స్లలో స్కోర్లు ఇలా ఉన్నాయి. 13, 18, 6, 10, 29, 2, 36, 23, 0 పరుగులు చేశాడు. భారత క్రికెట్లో నెక్స్ట్ సూపర్ స్టార్గా ఎదుగుతున్న గిల్ టెస్టులలో ఈ ఫామ్ ఆందోళనపరిచేదే. పుజారా, రహానే వంటి కీలక ఆటగాళ్లను పక్కనబెట్టి మరి సెలక్టర్లు గిల్కు అవకాశాలిస్తున్నారు. కానీ అహ్మదాబాద్లో ఆసీస్తో ఆడిన టెస్టు తర్వాత టెస్టులలో అతడి సగటు 17.30 మాత్రమే. ఈ ప్రదర్శనలతో వ్యక్తిగతంగా అతడితో పాటు జట్టుకూ నిరాశ కలిగిస్తున్నది.
Shubman Gill Constribution in
batting bowling fielding#INDvsENGpic.twitter.com/hHrVyYy9Ur
— Gaurav (@viratian_83) January 28, 2024
రెండో టెస్టుకు డౌటే..
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమైన నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్.. గిల్ను కోహ్లీ స్థానం (మూడు)లో బ్యాటింగ్కు పంపిస్తున్నది. అయితే దక్షిణాఫ్రికాలో వైఫల్యంతో పాటు తాజాగా స్వదేశంలోనూ అతడి చెత్త ప్రదర్శనతో వైజాగ్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులో గిల్కు తుది జట్టులో చోటు దక్కుతుందా..? అనేది అనుమానంగానే ఉంది. కోహ్లీ గైర్హాజరీలో రజత్ పాటిదార్కు జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు.. రెండో టెస్టులో అతడికి తుది జట్టులో చోటిస్తారనేది సమాచారం. గతేడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ పాటిదార్.. ఆ తర్వాత కోలుకుని దేశవాళీ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. గిల్ వైఫల్యం నేపథ్యంలో పుజారాకు తుది జట్టులో చోటు దక్కొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.