Shubhman Gill : భారత స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubhman Gill) ఈ ఏడాది శతకాల మోత మోగిస్తున్నాడు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్తో మొదలైన గిల్ సెంచరీల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కెరీర్లోనే సూపర్ ఫామ్లో ఉన్న గిల్ ఈరోజు ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీ బాదాడు. కంగారూలను ఉతికారేసిన అతను సియాన్ అబాట్(Sean Abott) ఓవర్లో సింగిల్ తీసి 100కు చేరువయ్యాడు. దాంతో, ఈ యంగ్స్టర్ వన్డే ఫార్మాట్లో ఆరో శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా తరఫున తక్కువ (35) ఇన్నింగ్స్ల్లోనే గిల్ ఆరో సెంచరీ బాదడం విశేషం.
అంతేకాదు 50 ఓవర్ల ఆటలో ఒకే ఏడాది 5 సెంచరీలు బాదిన ఏడో భారత బ్యాటర్గా గిల్ రికార్డు సృష్టించాడు. గిల్ కంటే ముందు విరాట్ కోహ్లీ(Virat Kohli) రోహిత్ శర్మ(Rohit Sharma), సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), సౌరభ్ గంగూలీ(Sourav Ganguly), శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఈ ఫీట్ సాధించారు.
📸💯#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/EMz50ZaTqO
— BCCI (@BCCI) September 24, 2023
కోహ్లీ అయితే రికార్డు స్థాయిలో నాలుగు ఏళ్లు(2012, 2017, 2018, 2019) వన్డేల్లో ఐదుసార్లు వంద కొట్టాడు. రోహిత్ మూడుసార్లు(2017, 2018, 2019)లో ఐదు శతకాలు సాధించాడు. సచిన్ 1996, 1998లో ఈ ఘనత సాధించాడు. గంగూలీ, ద్రవిడ్, ధావన్ మాత్రం ఒకేసారి ఈ రికార్డు నెలకొల్పారు.
కోహ్లీ, సచిన్, గిల్, రోహిత్,
అంతర్జాతీయంగా చూస్తే.. 25 ఏళ్ల వయసులో ఒకే క్యాలండర్ ఇయర్లో 5 శతకాలు కొట్టిన ఐదో క్రికెటర్గా గిల్ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అవును.. భారత దిగ్గజం సచిన్ టెండూర్కర్(1996లో), దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Greaeme Smith) 2005లో, శ్రీలంక క్రికెటర్ ఉపుల్ తరంగ(Upul Tharanga) 2006లో, విరాట్ కోహ్లీ 2012లో ఈ మైలురాయిని అందుకున్నారు.
ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్(105)తో కలిసి గిల్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్కు 200 రన్స్ జమ చేశారు. దాంతో, వన్డేల్లో కంగారూలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో భారత జోడీగా గిల్, అయ్యర్ రికార్డు క్రియేట్ చేశారు.
గిల్ , శ్రేయస్ అయ్యర్
ఈ జాబితాలో మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman), ఆల్రౌండర్ యువరాజ్(Yuvraj Singh) సింగ్ టాప్లో ఉన్నారు. వీళ్లు 2004లో ఆసీస్పై 213 రన్స్ చేశారు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ జోడీ రెండో స్థానంలో ఉంది. వీళ్లు 2016లో 212 రన్స్ జోడించారు. రోహిత్ శర్మ, కోహ్లీ 2016లోనే 207 పరుగులు జోడించారు.