ముంబై: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే.. దేశవాళీల్లో తప్పక ఆడాలని ఇటీవల బీసీసీఐ ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
వచ్చే నెల 2 నుంచి తమిళనాడుతో జరిగే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అయ్యర్ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం ప్రకటించిన 16 మందితో కూడిన జట్టులో శ్రేయస్ చోటు దక్కించుకున్నాడు.