కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో.. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. అరంగేట్రం టెస్టులోనూ అర్థశతకంతో అదరగొట్టాడు. అయిదో వికెట్కు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారు. శ్రేయస్ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా తొలి బ్యాటింగ్ చేసి 76 ఓవర్లలో నాలుగు వికెట్లకు 235 రన్స్ చేసింది. అయ్యర్ 66, జడేజా 37 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. అగర్వాల్ 13, గిల్ 52, పుజారా 26, రహానే 35 రన్స్ చేసి ఔటయ్యారు.