సిడ్నీ: టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటున్నట్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తెలిపారు. తమ ఫోన్ కాల్స్కు అయ్యర్ రిప్లై ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, కానీ డాక్టర్లు కేర్ తీసుకుంటున్నారని చెప్పాడు. మరికొన్ని రోజుల పాటు అతన్ని మానిటర్ చేయనున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూర్య పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడవ వన్డేలో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను అందుకోబోయిన అయ్యర్.. డైవ్ చేస్తూ కిందపడ్డాడు. ఆ సమయంలో పక్కటెముకల్లో అతని మోచేయి బలంగా తాకింది. దీంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. అయితే డ్రెస్సింగ్ రూమ్లో అయ్యర్ కుప్పకూలడంతో.. అతన్ని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో రెండు రోజుల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం అయ్యర్ కోలుకుంటున్నట్లు సూర్య తెలిపాడు.
🚨Suryakumar Yadav on Shreyas Iyer:
He’s recovering well. He’s replying to us on phone that means he is doing absolutely fine. It is unfortunate what happened but the doctors are taking care of him. He’ll be monitored for the next few days but nothing to be worried about.… pic.twitter.com/Wp7KYX20i4
— RevSportz Global (@RevSportzGlobal) October 28, 2025