Shreyas Iyer : ఐపీఎల్ పదిహేడో సీజన్తో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)తన ట్రోఫీ కలను నిజం చేసుకున్నాడు. మే 26న చెపాక్ స్టేడియంలో కెప్టెన్గా తొలి ఐపీఎల్ టైటిల్(IPL Trophy) అందుకొని అరుదైన క్లబ్లో చేరాడు. ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ సాధించిన భారత ఐదో సారథిగా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), గౌతం గంభీర్(Gautam Gambhir), రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లు తమ జట్లకు ట్రోఫీ కట్టబెట్టారు.
నాలుగేండ్ల క్రితమే అయ్యర్ సారథిగా తొలి ట్రోఫీని ముద్దాడేవాడే. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఫైనల్స్కు తీసుకెళ్లిన అయ్యర్కు షాకిస్తూ ముంబై టైటిల్ను ఎగరేసుకుపోయింది. అప్పుడు చేజారిన ట్రోఫీని ఇప్పుడు పదిహేడో సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరఫున గెలిచాడు. ఓ వైపు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో, టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్ ఐపీఎల్ ట్రోఫీతో వార్తల్లో నిలిచాడు.
For the third time, 𝒍𝒂𝒃𝒆𝒍𝒍𝒆𝒅 𝒊𝒏 𝒈𝒐𝒍𝒅! 🌟 pic.twitter.com/IrR9ZogO8J
— KolkataKnightRiders (@KKRiders) May 27, 2024
భారత క్రికెట్ బోర్డు 2008లో ఐపీఎల్ సీజన్ను అరంభించింది. అప్పటి నుంచి కేవలం ఐదుగురు భారత క్రికెటర్లు కెప్టెన్గా ట్రోఫీ అందుకున్నారు. ఈ లిస్ట్లో ఎంఎస్ ధోనీ, రోహిత్లు ఐదు టైటిళ్లతో అగ్రస్థానంలో నిలిచారు. టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున 2010, 2011, 2018, 2021, 2013లో ట్రోఫీలు గెలుపొందాడు.
హిట్మ్యాన్గా పేరొందిన రోహిత్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను 2013, 2015, 2017, 2019, 2020లో చాంపియన్గా నిలిపాడు. ప్రస్తుతం కోల్కతా మెంటార్గా ఉన్న గౌతం గంభీర్ 2012, 2014లో సారథిగా ఆ జట్టుకు రెండు ట్రోఫీలు సాధించి పెట్టాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్గా తొలి సీజన్లోనే హార్దిక్ పాండ్యా టైటిల్ కట్టబెట్టాడు.