మలక్పేట: కోయంబత్తూరు వేదికగా జరిగిన సౌత్జోన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రేయాన్సి, ప్రణవ్రావు విజేతలుగా నిలిచారు. తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాల నుంచి దాదాపు 200 మందికి పైగా ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి 25 మంది ప్లేయర్లు బరిలోకి దిగారు. మహిళల సింగిల్స్ విభాగంలో శ్రేయాన్సి, బాలుర సింగిల్స్లో ప్రణవ్రావు టైటిళ్లు దక్కించుకున్నారు.
మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్రెడ్డి, వైష్ణవి రన్నరప్గా నిలువగా, పురుషుల సింగిల్స్లో సాహాస్కుమార్, బాలికల సింగిల్స్లో ప్రశాన్సా రన్నరప్ దక్కించుకున్నారు. బాలుర సింగిల్స్లో హర్షిత్, బాలికల్లో రిషితాపాండే, డబుల్స్లో శిఖ, నయనికారెడ్డి విజేతలుగా నిలిచారని టీమ్ మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.