జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పురుషుల 25మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ విభాగం ఫైనల్లో యువ షూటర్ యోగేశ్సింగ్ 572 పాయింట్లతో పసిడి పతకంతో మెరిశాడు. అదే దూకుడు కనబరుస్తూ అమిత్కుమార్, ఓం ప్రకాశ్తో కలిసి యోగేశ్సింగ్ 1690 పాయింట్లతో మరో స్వర్ణాన్ని అందించాడు. టోర్నీలో భారత్ ప్రస్తుతం14 స్వర్ణాలు సహా 10 రజతాలు, 8 కాంస్యాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఉపఖండ టోర్నీలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.