Shoaib Malik : మూడో పెండ్లితో వార్తల్లో నిలిచిన పాకిస్థాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్( Shoaib Malik ) టీ20ల్లో సంచలనం సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో షోయబ్ 13 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో, టీ20ల్లో ఈ మైలురాయికి చేరువైన తొలి ఆసియా క్రికెటర్(Asian Cricketer)గా మాలిక్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయంగా చూస్తే.. వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) తర్వాత టీ20ల్లో 13 వేల రన్స్ కొట్టిన రెండో ఆటగాడిగా షోయబ్ గుర్తింపు సాధించాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BBL)లో ఫార్చ్యూన్ బరిషల్(Fortune Barishal) జట్టుకు ఆడతున్న మాలిక్ రంగాపూర్ రైడర్స్ (Rangapur Riders)తో జరిగిన మ్యాచ్లో 17 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాంతో, పొట్టి పార్మాట్లో 13 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఆల్రౌండర్ టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు.
Shoaib Malik has become the first Asian batter and the second overall to amass over 13,000 runs in T20 cricket. pic.twitter.com/W0m1EvQ7Pf
— CricTracker (@Cricketracker) January 20, 2024
షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా రెండో భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అతడు.. పాక్కు చెందిన నటి సనా జావెద్(Sana Javed)ను శనివారం వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి ఫొటోలను‘అహ్మదుల్లా.. మేము ఒక్కటయ్యాం’ అని క్యాప్షన్తో ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. సానియా కంటే ముందు మాలిక్ హైదరాబాద్కే చెందిన అయేషా సిద్దిఖీ(Ayesha Siddiqui)కి 2002లో పెండ్లి చేసుకున్నాడు.
మాలిక్, సనా జావెద్, సానియా
అయితే.. 2010లో ఆమెతో వివాహ బంధానికి స్వస్తి పలికి సానియాను మనువాడాడు. వీళ్లకు ఇజాన్(Izhaan) అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, గత కొంత కాలంగా సానియా, షోయబ్ వేరువేరుగా ఉన్నారు. దాంతో, వీళ్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. కానీ, మాలిక్, సానియాలు ఎక్కడా తాము విడిపోతున్నామని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే.. షరియా చట్టంలోని ఖులా పద్ధతిలో షోయబ్కు సానియా విడాకులు ఇచ్చిందని ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా తెలిపాడు.