దుబాయ్: వరల్డ్ కప్ ( T20 World Cup ) టీమ్లో మార్పులు చేసింది బీసీసీఐ. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ను 15 మంది సభ్యుల టీమ్లోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్ ఇప్పుడు స్టాండ్ బై జాబితాలో ఉండనున్నాడు. ఈ నెల 17 నుంచి వరల్డ్కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇండియా ఈ నెల 24న పాకిస్థాన్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్స్ను యూఏఈలోనే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, అవేష్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్లు ఐపీఎల్ తర్వాత కూడా టీమ్తోనే ఉండనున్నారు.