ముంబై: ముంబై, విదర్భ రంజీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మొదలైన ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రహానే(7), శ్రేయాస్ అయ్యర్(7) విఫలమైన చోట ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్(75) మరోమారు తన విలువ చాటుకున్నాడు. 81-1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించిన ముంబై 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో శార్దుల్ కీలక ఇన్నింగ్స్తో జట్టును గాడిలో పడేశాడు.
ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న శార్దుల్ సాధికారిక ఇన్నింగ్స్తో ముంబై తేరుకుంది. వన్డే తరహాలో ఆడిన శార్దుల్ 69 బంతుల్లో 75 పరుగులు చేశాడు. హర్ష్ దూబే, యశ్ ఠాకూర్ మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్కు దిగిన విదర్భ 3 వికెట్లకు 31 పరుగులు చేసింది. అథర్వ (21), ఆదిత్య (0) క్రీజులో ఉన్నారు. ధవల్కులకర్ణి రెండు వికెట్లు పడగొట్టాడు.