Shahid Afridi | మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాక్ చీఫ్ సెలెక్టర్గా నియామకమయ్యాడు. వసీం అబ్బాసీ స్థానంలో పీబీసీ అఫ్రిదిని తాత్కాలిక చీఫ్ సెలెక్టర్గా నియమించింది. ప్రస్తుతం పాక్ క్రికెట్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల కిందట పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాపై ప్రభుత్వం వేటు వేసింది. ఆ తర్వాత నజామ్ సేథీ పీసీబీ చైర్మన్గా నియామకమయ్యారు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో పాక్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తగా.. క్రికెట్ బోర్డులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రస్తుతానికి అఫ్రిది సెలెక్టర్గా వ్యవహరించనుండగా.. శ్వాత చీఫ్ సెలెక్టర్ను ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా.. యాషెస్లో ఇంగ్లండ్ జట్టు ఘోర ఓటమి తర్వాత ఈసీబీ బోర్డులో అనేక మార్పులు జరిగాయి. బ్రెండన్ మెకల్లమ్ జట్టుకు కొత్త కోచ్గా నియామకమయ్యాడు. అప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టు అద్భుతాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే పీసీబీ సైతం అదే పద్ధతిని అనుసరిస్తున్నది. షాహిద్ అఫ్రిదీతో పాటు అబ్దుల్ రజాక్, రావ్ ఇఫ్తికర్ అంజుమ్ సైతం సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పాత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టును సమీక్షించి సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకుంటే మార్పులు చేసేందుకు కొత్త సెలక్షన్ కమిటీకి పీసీబీ తొలి బాధ్యతను అప్పగించింది.
ఈ జట్టు న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్లో ఆడనున్నది. ఈ సందర్భంగా పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ మాట్లాడుతూ అఫ్రిది దూకుడైన క్రికెటరని, దాదాపు అతనికి 20 ఏళ్లు ఆట ఆడిన అనుభవం ఉందన్నారు. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు మద్దతు ఇచ్చాడని, పాక్కు ఆడేందుకు ఉత్తమ జట్టును ఎంపిక చేయడంలో సహకారం అందిస్తాడన్నారు. పీసీబీ అప్పగించిన బాధ్యతలను గౌరవంగా భావిస్తున్నట్లు అఫ్రిది చెప్పాడు. న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు బలమైన జట్టును ఎంపిక చేస్తామని, ఇందు కోసం త్వరలోనే సెలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపాడు.