World Cup Final | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ (World Cup Final) భారతీయులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఆది నుంచి వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న రోహిత్ సేన.. చివరి మ్యాచ్లో తడబాటుకు గురైంది. ఫలితంగా ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని కప్పును చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ టీమ్ఇండియా చివరి నిమిషంలో బోల్తాపడింది. ఈ ఓటమితో భారత క్రీడాలోకం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. మరోవైపు కప్ చేజారడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జట్టు ఓటమిపై ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తాజాగా స్పందించారు. ‘మొత్తం టోర్నమెంట్లో భారత జట్టు ఆడిన విధానం గౌరవప్రదమైనది. గొప్ప స్ఫూర్తిని నింపారు. దృఢత్వాన్ని ప్రదర్శించారు. ఇది ఆట. ఇందులో ఒకట్రెండు చెడు రోజులు ఉంటాయి. దురదృష్టవశాత్తు అది ఈరోజు మనకు జరిగింది. కానీ, క్రికెట్లో మన క్రీడా వారసత్వాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన టీమ్ ఇండియాకు ధన్యవాదాలు. భారత దేశం మొత్తానికి సంతోషాన్ని తెచ్చారు. దేశాన్ని గర్వపడేలా చేశారు’ అంటూ రాసుకొచ్చారు.
The way the Indian team has played this whole tournament is a matter of honour and they showed great spirit and tenacity. It’s a sport and there are always a bad day or two. Unfortunately it happened today….but thank u Team India for making us so proud of our sporting legacy in…
— Shah Rukh Khan (@iamsrk) November 19, 2023
మరో నటుడు రణ్వీర్ సింగ్ కూడా టీమ్ఇండియాకు మద్దతుగా నిలిచారు. క్రీడీల్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయని అన్నారు. మంచి రోజులు ఉంటాయని, అదే సమయంలో చెడ్డ రోజులు కూడా పలకరిస్తుంటాయన్నారు. గెలుపు ఓటములూ సహజమేనని అన్నారు. జీవితం కూడా అంతే అని, మనమందరం దృఢంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty) కూడా ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు ముందుగా అభినందనలు తెలిపారు. ‘ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించినందుకు ఆస్ట్రేలియాకు అభినందనలు..! అయితే, టీమ్ఇండియాకు ఓ బ్యాడ్ డే. కానీ, ఈ టోర్నమెంట్లో మన జట్టు 10 మ్యాచ్లు గెలిచిన సంపూర్ణ శక్తిని మనం కోల్పోవద్దు..!’ అంటూ ట్వీట్ చేశారు.
Congratulations to Australia on their World Cup Final victory!
One bad day for #MyTeamIndia.
So let’s not lose sight of the absolute force this #TeamIndia has been throughout the tournament, winning 10 matches on the trot! Truly a world-class team with outstanding performances… pic.twitter.com/gXGninVr0K
— Suniel Shetty (@SunielVShetty) November 19, 2023
వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచింది. కీలకమైన సెమీస్లోనూ 2019 రన్నరప్ న్యూజిలాండ్ను 70 పరుగులతో చిత్తు చేయడంతో ఈసారి ట్రోఫీ మనదే అనుకున్నారంతా. అయితే.. దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ చేరడంతో ట్రోఫీ దక్కేనా? అని మనసులో సందేహం. అనుకున్నట్టుగానే కంగారూల చేతిలో రోహిత్ సేన ఓటమిపాలైంది. అహ్మాదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. ఆసీస్ పేసర్ల విజృంభణతో 240 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఆదిలోనే మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) గోడలా నిలబడ్డారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
Also Read..
Anand Mahindra | ఓటమిని కూడా అంగీకరించాల్సిందే.. టీమ్ఇండియా పరాజయంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Virat Kohli | చేజారిన ప్రపంచ కప్.. కోహ్లీని ఓదార్చిన అనుష్క.. పిక్స్ వైరల్
Infosys | ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు.. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్పై కీలక ప్రకటన