భారత మహిళల చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు
లక్నో: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ (30 బంతుల్లో 60; 7ఫోర్లు, 5 సిక్స్లు) వీరబాదుడుతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చిత్తయింది. మంగళవారం మూడో టీ20లో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో సఫారీ జట్టును ఓడించి, సిరీస్ను 1-2తో ముగించింది. తొలుత రాజేశ్వరీ (3/9) సహా బౌలర్లు సత్తాచాటడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ సునే లుస్ (28) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యఛేదనలో షెఫాలీ విజృభించడం సహా కెప్టెన్ స్మృతీ మంధాన (28 బంతుల్లో 48) రెచ్చిపోవడంతో 11 ఓవర్లలోనే టీమ్ఇండియా 114 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మరోవైపు ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో షెఫాలీ మళ్లీ అగ్రస్థానానికి చేరింది.