న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ టోర్నీలో కరోనా కలకలం సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్షిప్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్తో సహా ఏడుగురు భారతీయ షట్లర్లు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారు. దీంతో ఏడుగురు ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగారు. క్రీడాకారులు కరోనా బారినపడ్డట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) పేర్లతో సహా ధ్రువీకరించింది.
అంతకు ముందు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) ఈ విషయాన్ని తెల్లవారుజామున తెలిపింది. కొవిడ్ బారినపడ్డ వారిలో శ్రీకాంత్తో పాటు అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్ ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు వైరస్ బారినపడ్డారు. క్రీడాకారులకు మంగళవారం ఆర్టీ పీసీఆర్ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. కరోనా బారినపడ్డ క్రీడాకారుల ప్రత్యర్థులను తదుపరి రౌండ్కు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.