హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. ప్లేట్ గ్రూప్ తొలి పోరులో అలవోక విజయం సాధించిన హైదరాబాద్.. శుక్రవారం మేఘాలయతో మ్యాచ్లోనూ సత్తాచాటింది. మన బౌలర్ల ధాటికి మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 111 పరుగులకే ఆలౌటైంది. సాయిరామ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్.. ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (54 నాటౌట్), చందన్ సహానీ (52) అర్ధశతకాలు సాధించారు.