Saurabh Tiwari | న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 16 నుంచి రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించాడు. మహేంద్రసింగ్ ధోనీ అడుగుజాడల్లో జార్ఖండ్ నుంచి వచ్చిన సౌరభ్ తివారీ కెరీర్ ఆరంభంలో భారీ హిట్టింగ్తో మరో జులపాల ధోనీగా గుర్తింపు పొందాడు.
టీమ్ఇండియా తరఫున మూడు వన్డేలు ఆడిన 34 ఏండ్ల తివారీ.. ఐపీఎల్లో నాలుగు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో తివారీ సభ్యుడిగా ఉన్నాడు. ‘ఇదే సరైన సమ యం అనుకుంటున్నా. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ పోటీలో లేనప్పుడు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. యువ ఆటగాళ్ల అవకాశాలను కాలరాయడం సరికాదు’ అని సౌరభ్ పేర్కొన్నాడు. 2010లో జాతీయ జట్టుకు ఎంపికైన సౌరభ్.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 47.51 సగటుతో 8030 పరుగులు చేశాడు.