న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఏప్రిల్ ఆఖరి వారంలో భారత జట్టును ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు ప్రకటనకు ఐసీసీ మే 1ని ఆఖరి తేదీగా ప్రకటించింది. ఒకవేళ టీమ్లో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే మే 25వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఐపీఎల్తో సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లతో పాటు పలువురు యువ క్రికెటర్లు బిజీగా ఉన్నారు. ఏప్రిల్ నెలాఖరుకు ఐపీఎల్లో తొలి దశ మ్యాచ్లు పూర్తవుతాయి. అప్పటిలోగా క్రికెటర్ల ప్రదర్శన, ఫిట్నెస్, ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటూ జట్టు ఎంపిక ఉంటుందని బోర్డు వర్గాలు శనివారం పేర్కొన్నాయి.