FIFA World Cup : ఖతర్లో జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో మరో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఫుట్బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ అమెరికాకు చెందిన గ్రాంట్ వహ్ల్ అనే జర్నలిస్ట్ గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త మరవక ముందే మరో జర్నలిస్ట్ మృతి చెందాడు. ఖతర్కు చెందిన అల్ కాస్ టీవీ ఛానెల్కు చెందిన ఖలీద్ అల్ మిస్లాం అనే ఫొటో జర్నలిస్ట్ డిసెంబర్ 10న (శనివారం) అనుకోకుండా మృతి చెందాడు. అతని మరణానికి కారణం ఏంటనేది మాత్రం తెలియలేదు. గల్ఫ్ టైమ్స్ ట్విట్టర్ వేదికగా ఖలీద్ మరణం పట్ల సంతాపం ప్రకటించింది.
లూసెయిల్ స్టేడియంలో మ్యాచ్ లైవ్ ఇస్తుండగా గ్రాంట్కు గుండెపోటు రావడంతో అతను తన సీటులో కుప్పకూలిపోయాడు. దాంతో, వైద్య సిబ్బంది అతనికి అత్యవసర వైద్యం అందించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో డాక్టర్లు అతను చనిపోయినట్టు చెప్పారు. అయితే గ్రాంట్ది సహజ మరణం కాదని అతని సోదరుడు ఆరోపించాడు. ఎందుకంటే.. నవంబర్ 21వ తేదీన అతను ఎల్జీబీటీ కమ్యూనిటీకి మద్దతుగా రెయిన్బో బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకున్నాడు. దాంతో, తనను అమెరికా, వేల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు సెక్యూరిటీ గార్డు అనుమతంచలేదని గ్రాంట్ ట్వీట్ చేశాడు. ‘నువ్వు ఈ టీషర్ట్ మార్చుకోవాలి. ఈ టీషర్ట్తో నిన్ను లోపలికి అనుమతించను’ అని అతను చెప్పాడని గ్రాంట్ ఆ ట్వీట్లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ నేపథ్యంలోనే అతని సోదరుడు అనుమానాలు వ్యక్తం చేశాడు.
Al Kass TV photojournalist Khalid al-Misslam passed away recently.
Al- Misslam, a Qatari, died suddenly while covering the FIFA World Cup Qatar 2022. We believe in Allah’s mercy and forgiveness for him, and send our deepest condolences to his family. pic.twitter.com/M1ZyoBJWkW— Gulf-Times (@GulfTimes_QATAR) December 10, 2022