టీ20 ప్రపంచకప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పసికూన స్కాట్లాండ్ గట్టిగా పోరాడింది. మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్తో జరుగుతున్న గ్రూప్ దశ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. స్కాట్లాండ్ ఆటగాడు జార్జ్ మున్సే (66 నాటౌట్), మైకేల్ జోన్స్ (20), కాలమ్ మాక్లాయిడ్ (23) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. ఒడియన్ స్మిత్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.