ఒసిజెక్(క్రొయేషియా): ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. గురువారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంటులో యువ షూటర్ సౌరభ్ చౌదరీ కాంస్య పతకంతో మెరిశాడు. ఫైనల్లో సౌరభ్ 220 పాయింట్లతో నిలువగా, ఇదే విభాగంలో పోటీపడ్డ అభిషేక్ వర్మ(179.3) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.