భద్రాచలం: ఆరవ రాష్ట్ర స్థాయి గిరిజన గురుకులాల క్రీడలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ప్రారంభించారు. విద్యతోనే గిరిజన బిడ్డల వికాసం సాధ్యమని ఆమె అన్నారు. విద్య ఆవశ్యకతను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ ‘క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం. ఓడినా నిరుత్సాహ పడవద్దు. ప్లేయర్లు క్రీడా స్ఫూర్తిని చాటాలి’ అని అన్నారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 1200 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే వీరయ్య తదితరులు పాల్గొన్నారు.