పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-13, 24-22 తేడాతో ఒంగ్ యూ సిన్, తియో ఈ యి(మలేషియా) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. 47 నిమిషాల్లో ముగిసిన పోరులో సాత్విక్, చిరాగ్ తమదైన రీతిలో సత్తాచాటారు.
ప్రస్తుత బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ జోడీగా కొనసాగుతున్న సాత్విక్, చిరాగ్..మలేషియా జంటపై గత ఎనిమిది మ్యాచ్ల్లో ఇది ఐదోసారి గెలువడం. తదుపరి రౌండ్లో భారత ద్వయం..మరో మలేషియా జోడీని ఎదుర్కొనుంది. కామన్వెల్త్గేమ్స్ కాంస్య విజేత గాయత్రీ గోపీచంద్, త్రిసాజాలీ జోడీ 16-21, 21-19, 21-17తో భారత్కే చెందిన అశ్విని పొనప్ప, తనీషా క్య్రాస్ట్రో జంటపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇటీవల జరిగిన ఆసియా టీమ్ చాంపియన్షిప్లో భారత్ చారిత్రక విజయంలో గాయత్రి, త్రిసా జాలీ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.