China Masters: చైనాలోని షెన్హెన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల డబుల్స్ ధ్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలు సెమీఫైనల్స్కు దూసుకెళ్లారు. శుక్రవారం షెన్మెన్ వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ భారత జోడీ.. 21-16, 21-14 తేడాతో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ పదమూడో ర్యాంక్ జంట లియో రాలీ కార్నండో – డానియల్ మార్టిన్పై వరుస సెట్లలో గెలుపొందారు. 46 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో భారత జోడీ.. ఆద్యంతం ఆధిపత్యం చెలాయించి సెమీస్కు దూసుకెళ్లారు.
కొద్దిరోజుల క్రితమే ఆసియా క్రీడలలో ఛాంపియన్స్గా నిలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన హె జి టింగ్ – రెన్ జియాంగ్ యూ, లి యూ చెన్ – ఔ క్సాన్ వి జోడీ మధ్య గెలిచిన విజేతతో తలపడనుంది. ఈ ఏడాది భారత జోడీ.. ఇండోనేషియా సూపర్ 1000, కొరియా సూపర్ 500, స్విస్ సూపర్ 300 గెలుచుకున్న విషయం విదితమే.
News Flash: Satwik/Chirag storm into SEMIS of China Masters.
The star Indian duo beat WR 13 Indonesian pair Carnando/Marthin 21-16, 21-14. #ChinaMasters2023 pic.twitter.com/AY3KdkFBRV
— India_AllSports (@India_AllSports) November 24, 2023