దుబాయ్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ జంట మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం చేజిక్కించుకుంది.
ఈ సీజన్లో ఆడిన రెండు టోర్నీ (మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్)ల్లో రన్నరప్గా నిలిచిన ఈ జంట ఏడాదిన్నర తర్వాత తిరిగి టాప్కు చేరింది. సింగిల్స్లో ప్రణయ్ 8వ ర్యాంక్ దక్కించుకోగా.. లక్ష్యసేన్ 19వ స్థానంలో నిలిచాడు.