షెన్జెన్ : భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ టోర్నీ ఫైనల్స్కు చేరుకుంది. శనివారం సెమీఫైనల్స్లో భారత జోడి చైనాకు చెందిన టింగ్-రెన్ జియాంగ్ యులను 21-15, 22-20 స్కోరుతో 50 నిమిషాలలో ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్లో వారు మరో సెమీస్లో తలపడే రెండు చైనా జట్ల మధ్య విజేతతో ఆదివారం ఢీకొంటారు. తొలి గేమ్ను సునాయాసంగా గెలుచుకున్న భారత జోడి రెండో గేమ్లో చైనా ద్వయం నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నది.
ప్రతి పాయింట్ కోసం సాత్విక్-చిరాగ్ చెమటోడ్చారు. హోరాహోరీ సాగిన పోరులో చివరకు భారత జోడినే విజయం వరించింది. టాప్ సీడ్గా టోర్నీలో బరిలోకి దిగిన సాత్విక్-చిరాగ్ తమ సీడింగ్కు న్యాయం చేకూర్చుతూ ఫైనల్స్కు చేరుకున్నారు. ఈ యేడాది ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీ, ఇండోనేషియా సూపర్ 1000 టోర్నీ, కొరియా సూపర్ టోర్నీ, స్విస్ టోర్నీతో పాటు ఆసియన్ గేమ్స్లో స్వర్ణం గెలుచుకుని సూపర్ ఫామ్లో కొనసాగుతున్న భారత జోడి, ఇదే జోరుతో చైనా మాస్టర్స్ టైటిల్ను కూడా దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.