బాసెల్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదివారం సాత్విక్-చిరాగ్ జంట 21-19, 24-22తో రెన్ జియాంగ్-టాన్ క్వాంగ్ (చైనా) ద్వయంపై విజయం సాధించింది.
54 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో రెండో సీడ్ భారత జోడీ.. తిరుగులేని ప్రదర్శన కొనసాగిస్తూ వరుస గేమ్ల్లో విజేతగా నిలిచింది.