హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో మెరుగైన ఫలితాల కోసం క్రీడా సంఘాలన్నీ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో మెరుగైన ఫలితాల సాధన కోసం జీవో ఎంఎస్ నంబర్ 4ను పకడ్బందీగా అమలు చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రీడా సంఘాలన్నీ వెంటనే సంబంధిత డాక్యుమెంట్లు సాట్స్ అథారిటీకి సమర్పించాలి.
ప్రభుత్వం అందించే పతకాలు ప్లేయర్లకు అందాలంటే క్రీడా సంఘాల్లో పారదర్శకత అవసరం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్రీడా సంఘాలు పనిచేయాలి’ అని అన్నారు. ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సాట్స్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ విజన్కు అనుగుణంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, ప్రేమ్రాజ్, మల్లారెడ్డి, శోభన్బాబు, సాట్స్ అధికారులు పాల్గొన్నారు.