Sanju Samson | స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండో టీ20 మ్యాచ్కు వికెట్ కీపర్ సంజూశ్యామ్సన్ అందుబాటులో ఉండడం అనుమానాస్పదంగా మారింది. ముంబయి వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో సంజూ గాయపడ్డాడు. పుణేలో జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు చేరుకున్నాయి. సంజూ శ్యామ్సన్ మోకాలి సమస్యతో ఇంకా ముంబయిలోనే ఉండగా.. స్కానింగ్ చేయనున్నారు.
ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంక ఇన్నింగ్స్లో తొలి ఓవర్లో డైవింగ్ క్యాచ్ అందుకుంటూ గాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మోకాలు వాచిపోయింది. బ్యాటింగ్కు దిగినా ఆరుబంతుల్లో ఐదు పరుగులు చేసి అవుటయ్యాడు. ఇదిలా ఉండగా మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలిమ్యాచ్లో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో ఆరు బాల్స్కు 13 పరుగులు చేయాల్సి ఉండగా.. కెప్టెన్ హార్దిక్ ప్యాండ్యా అక్షర్ పటేల్ను బౌలింగ్కు పంపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేసి కెప్టెన్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ జట్టుకు విజయాన్ని అందించాడు.