దుబాయ్ : భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్వదేశం వేదికగా జరిగిన మెగాటోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా..వరుసగా రెండో టైటిల్ను నిలబెట్టుకుంది. టోర్నీలో తొలి మ్యాచ్లకు దూరంగా ఉన్న శాంసన్..కీలకమైన దశలో తనదైన శైలిలో విజృంభించి జట్టుకు చిరస్మరణీయ విజయాలందించాడు.
జింబాబ్వేపై 24 పరుగులతో మొదలైన శాంసన్ దూకుడు వెస్టిండీస్పై 97, ఇంగ్లండ్తో సెమీస్లో 89, ఫైనల్లో కివీస్పై 89 పరుగులతో మొత్తంగా 199 ్రైస్టెక్రేట్తో 275 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కైవసం చేసుకున్నాడు. తన కెరీర్లో శాంసన్కు ఇది తొలి మంత్లీ ఐసీసీ అవార్డు. మహిళల విషయానికొస్తే న్యూజిలాండ్ క్రికెటర్ అమెలీ కెర్కు ఐసీసీ అవార్డు సొంతం చేసుకుంది.