Sanju Samson | జైపూర్: నిర్దేశిత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు గాను రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్కు జరిమానా పడింది. బుధవారం జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ కేటాయించిన సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తిచేయకపోవడంతో శాంసన్కు రూ. 12 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
రెండోసారీ ఇదే తప్పు పునరావృతమైతే కెప్టెన్కు రూ. 24 లక్షలు, జట్టులోకి ఇతర ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడుతుంది.