పారిస్: భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ ఫ్రెంచ్ ఓపెన్లో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బుధవారం శ్రీకాంత్ 21-18, 21-18తో భారత్కే చెందిన లక్ష్యసేన్పై విజయం సాధించగా.. సమీర్ వర్మ 21-15, 21-23, 22-20తో ఆరోసీడ్ ఆంటోనీ గింటింగ్ (ఇండోనేషియా)ను చిత్తు చేశాడు.
46 నిమిషాల్లో ముగిసిన పోరులో లక్ష్యసేన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా శ్రీకాంత్ వరుస గేమ్ల్లో మ్యాచ్ను ముగించాడు. గంటా 17 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో అన్సీడెడ్ సమీర్ వర్మ అదరగొట్టాడు. మరో మ్యాచ్లో ప్రణయ్ 21-16, 16-21, 21-16తో డారెన్ (మలేషియా)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్లో అర్జున్-ధ్రువ్ జోడీ ముందంజ వేసింది.